***అంతరం***

భూమిని చీల్చుకు వచ్చే అంకురంలా.. 
కన్న ప్రేగును తెంచుకు పుట్టిన బిడ్డ 

పైరు ఎదిగినాక నాటిన రైతు కోసం ఆత్మ త్యాగం
ఎదిగిన బిడ్డ కన్నవారికి మిగిల్చేది కన్నీరు 

ఆశపడిన రైతుకు కాసుల వర్షం... 
ఏదో.. చేస్తాడని నమ్మిన కుటుంబానికి.. 
కన్నీటి ధార  మిగులుస్తున్న నేటి తరం

మొక్కపాటి మానవత్వం లేని నేటి సమాజ
యువతకు కనువిప్పు కలిగేది ఏనాటికో.. 

తరాలు మారుతున్నా.. అంతరంగ ఖాళీని 
పూడ్చే రోజు  ఎనాడొస్తుందో...!    

                        ... గోపి బుడుమూరు

No comments: