*** వందనం.. 🙏 ***

 ప్రపంచం స్థంబించడం అంటే ఇదేనా..!
అంతా నీ మహిమే అనుకుంటా కరోనా..!
కనిపించని జీవిలా మమ్మల్ని కబలిస్తున్నా..
కనిపించకుండా పోతున్న మానవత్వాన్ని 
మాకు గుర్తు చేశావు 
మనిషికి మనిషికి మధ్య సామాజిక దూరం పెట్టినా...
కుటుంబాల్ని గుమ్మంలోపలే వుంచి మనసుల్ని దగ్గర చేశావు.
పైసా వెనుక పరుగులు పెడుతూ..
యంత్రాలు సైతం సిగ్గుపడేలా మారిన 
యాంత్రిక జీవితంలో...
డబ్బు కన్నా ఆరోగ్యం మిన్న అని గుర్తు చేశావు..
నేను.. నాకే.. అంటూ స్వార్థ మై పోతున్న సమాజంలో..
స్వార్థ రహిత సేవ చేసే వారిని చూపి కళ్ళు తెరిపించావు.
నువ్వు మా ప్రాణాలు తీసే మహమ్మారివే అయినా...
మమ్మల్ని మాకు తిరిగి పరిచయం చేసిన నీకు వందనం.. 🙏🙏🙏


                                                                                                నిష్ఠ (గోపి బుడుమూరు)
కరోనా సమయంలో వ్రాసిన కవిత ఇప్పుడు ప్రచురించడమైనది. 

No comments: